మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న భాను కిరణ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భాను గన్మన్గా పని చేసిన మధుమోహన్ను సీఐడీ అధికారులు విచారించిన సందర్భంగా కొత్త విషయాలు బయట పడుతున్నాయి.
హత్యకు గురయ్యే కొన్ని రోజుల ముందు భానుతో కలిసి సూరి గోవా వెళ్ళాడు. వీరితో పాటు సంచలన దర్శకుడు రాంగోపాల్వర్మ, ఇద్దరు హీరోయిన్లు, ఓ ప్రముఖ హీరో కూడా వీరితో ఉన్నారు. గోవాలో భాను, సూరిల మధ్య సెటిల్మెంట్ల వ్యవహారం, జైలులో ఉన్న సమయంలో భాను చేసిన దందాలపై చర్చ వచ్చింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహించిన సూరి భాను తలపై తుపాకి పెట్టి బెదరించాడని మధుమోహన్ సీఐడీ పోలీసులకు చెప్పాడు. ఈ గొడవ సందర్భంగా అక్కడే ఉన్న రాంగోపాల్వర్మ..
No comments:
Post a Comment